పెళ్లైన ఏడు నెలలకే ఓ భర్త తన భార్యను కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలోని బద్వేల్ లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు హరిని అదుపులోకి తీసుకున్నారు. భార్య మంజుల(23)పై అనుమానంతోనే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.