ఝార్ఖండ్ను కొన్ని రోజులుగా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా పలమావు జిల్లా నుంచి రాంచికి నలుగురు వ్యక్తులో వస్తున్న అంబులెన్సు కొట్టుకుపోయింది. ఆ సమయంలో అంబులెన్సులో ఓ పేషెంట్తో పాటు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.
కోయల్ నది సమీపంలోని సిథోయా వంతెన వద్దకు రాగానే అంబులెన్సుఆగిపోయింది. దాంతో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి దిగి అంబులెన్సును నెట్టేందుకు యత్నించారు. అప్పటికే వరదల ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అంబులెన్సు కొట్టుకుపోయింది. దాంతో రోగితో సహా మిగతావారు కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని డ్రైవర్ ఎవ్వరికీ చెప్పకుండా పారిపోయాడు. బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో గల్లంతైనవారి కోసం గాలింపు చేపట్టారు.