కర్నూలు జిల్లా, మహానంది మండలం బొల్లవరం రోడ్డు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరోక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మహానంది మండలం తిమ్మాపురం వాసి దూదేకుల ఉసేనిగా గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.