ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన ఆలూరు, ఎల్లార్తి రోడ్ మార్గంలో పెట్రోల్ బంక్ దగ్గర శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హాలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన కె. బసవరాజు, రంగన్నలు ద్విచక్ర వాహనంపై ఆలూరుకు పని నిమిత్తం వచ్చి తిరిగి తమ స్వగ్రామానికి బయలుదేరారు. బిల్లేహల్ గ్రామం నుండి ఆలూరుకు వస్తున్న ట్రాలీ ఆటో, బైక్ రెండు ఢీ కొన్నాయి. ద్వి చక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగన్నకు మెరుగైన చికిత్స కొరకు వైద్యులు బళ్లారికి తరలించారు.