న్యూఢిల్లీ: క్షణికావేశం మనిషిని ఎంత ఉన్మాదిగా తయారుచేస్తుందో కళ్లకు కట్టే సంఘటన ఇది... సిగరెట్ డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి వ్యాపారిని కత్తితో పొడిచి పారిపోయాడు. లూదియానాలోని శరభ నగర్ ప్రాంతంతో సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. దుకాణం యజమాని సునీల్ కుమార్ కథనం ప్రకారం.. సోమవారం సాయత్రం సునీల్కు సహకరించేందుకు అతడి బావమరిది రోహిత్ షాప్కి వచ్చాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన ఓ కస్టమర్ రోహిత్ను సిగరెట్ అడిగాడు. 12 రూపాయల సిగరెట్ కొనుక్కుని 10 రూపాయలే ఇచ్చాడు. మరో 2 రూపాయలు ఇవ్వాలని అడగ్గా ఇచ్చేందుకు నిరాకరించాడు. మాటామాటా పెరగడంతో ఉన్మాదిలా మారిన కస్టమర్... రోహిత్ను కత్తితో పొడిచి పారిపోయాడు. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం రోహిత్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.