ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సెల్' వాడొద్దన్నారని బాలిక ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 24, 2021, 12:47 PM

కర్నూల్ జిల్లా, నగానపల్లి మండలం యాగంటి పల్లె వద్ద గాలేరు-నగరి కాలువ సమీపంలో తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట జిల్లా మరేకల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన బాలిక (15) మృతి ఆత్మహత్యేనని డోన్ డీఎస్పీ నరసిం హారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేశారు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుండడంతో తండ్రి మందలించాడు. అదే రోజు రాత్రి వారు నివసిస్తున్న గుడిసెలో ఎవరూ లేని సమయంలో ఓ చెంబులో డీజిల్ తీసుకెళ్లి నిప్పంటించుకున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com