కర్నూలు జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. కస్తూరిభా గాంధీ స్కూల్లో 53 మంది విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డీఎమ్హెచ్వో అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఆదోని గాంధీస్కూల్లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, కరోనాను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.