న్యూఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. భారత రాజ్యాంగ పరిరక్షణ చేస్తానని ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రామ్నాథ్ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేస్తానని కూడా ఆయన శపథం చేశారు. రాష్టప్రతిగా ప్రమాణం చేసిన రామ్నాథ్ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సీటుపై కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు హాజరయ్యారు.