కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలో మేడూరు-ఆర్లపాడు రోడ్డు భోగందాని చెరువు దగ్గర గురువారం భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆర్లపాడు గ్రామానికి చెందిన ఒక కుటుంబం బైక్ పై వెళ్లుచుండగా ట్రాక్టర్ ఢీ కొట్టింది. ట్రాక్టర్ మహిళపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచి పెట్టింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.