దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా మందుల కొరతపై కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని, చోద్యం చూడటం సరికాదని కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపడింది. రేపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.