ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యాదీవెన డబ్బు రాకుంటే కాల్ చేయండి: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 19, 2021, 01:00 PM

జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బును సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ డబ్బును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10.88 లక్షల ఖాతాల్లో రూ.671.45 కోట్లు జమ చేశామని అన్నారు. అన్ని అర్హతలు ఉండి ఎవరికైనా ఫీజు రీఎంబర్స్ మెంట్ డబ్బు రాకుంటే గాబరా పడవద్దని జగన్ కోరారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే 1902 నెంబర్ కు ఫోన్ చేసి అధికారుల దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com