గుంటూరు : గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ సీజనలో తొలి స్వైనఫ్లూ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లికి చెందిన పఠాన జుబేదా అనే రెండేళ్ల చిన్నారి స్వైనఫ్లూ బారిన పడింది. మూడు రోజులుగా బాలిక శ్వాస పీల్చుకోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తెచ్చారు. శిశు వైద్య విభాగంలో చేర్చుకుని కృత్రిమ శ్వాస కల్పించారు. నాజిల్ స్వ్యాబ్స్ సేకరించి మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షించారు. సోమవారం వెలువడిన ఫలితంలో బాలికకు స్వైనఫ్లూ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్టు ఇచ్చారు. దీంతో జుబేదాను ఇతర చిన్నారుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా ఐసోలేషన వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఈ సమాచారం సూపరింటెండెంట్ డీఎస్ రాజునాయుడుకు అందించారు. ముందస్తు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ సిబ్బంది, కుటుంబ సభ్యులతో ట్యామీఫ్లూ మాత్రలు మింగించారు. అదే విధంగా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో సర్వెలెన్స చేయాలని ప్రకాశం జిల్లా డీఎంహెచవో డాక్టర్ జే యాస్మీన, ఎపిడమాలజిస్ట్ పుల్లారావుకు సమాచారం అందించారు. జుబేదా స్వైనఫ్లూ బారిన పడినట్లు తెలియడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామంలో స్వైనఫ్లూ సర్వెలెన్స చేయించాలని పలువురు కోరుతున్నారు.