అమరావతి : క్రీడాస్ఫూర్తి ఓటమిలో కూడా గౌరవాన్ని తీసుకువస్తుంది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత మహిళల జట్టు ఓటమి పాలైనప్పటికీ వారి క్రీడాస్ఫూర్తి, పోరాట పటిమా ఆటకు వన్నె తీసుకువచ్చాయి. వారి పట్ల గౌరవాన్ని పెంచాయి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. భారత మహిళల క్రికెట్ జట్టును ఆయన అభినందించారు.