అనాహీమ్(కాలిఫోర్నియా): యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ విజేతగా హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్- హెచ్ఎస్ ప్రణయ్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో ప్రణయ్ విజయం సాధించి తన కెరీర్లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ని దక్కించుకున్నాడు.
సుమారు 65 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ 21-15, 20-22, 21-12తో కశ్యప్పై విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం ప్రణయ్, కశ్యప్ ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్-2017 టోర్నీ విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. అకాడమీలో నాతో పాటు శిక్షణ పొందుతోన్న పారుపల్లి కశ్యప్పై విజయం సాధించాను. నాకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు’ అని ప్రణయ్ పేర్కొన్నాడు. ‘యూఎస్ ఓపెన్-2017 టోర్నీ రన్నరప్గా నిలిచాను. ఈ వారం నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. విజేతగా నిలిచిన ప్రణయ్కి శుభాకాంక్షలు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, గోపీ చంద్, భారత ప్రభుత్వానికి, జాతీయ క్యాంపులో నాకు శిక్షణ ఇచ్చిన కోచ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులోనూ మీ మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని కశ్యప్ పేర్కొన్నాడు.