చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్ అందరికి సోకుతోంది. ఇప్పటికే పలువురు సీఎంలను, కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను.. ఉన్నతాధికారులను ఇలా ఎవ్వరు దొరికితే వాళ్లు అనే తరహాలో కరోనా వైరస్ సోకింది.. ఇక, ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ.. కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కరోనా సోకింది. ఇటీవలే మోహన్ భగవత్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భగవత్కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆర్ఆర్ఎస్ శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు.. నాగ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ భగవత్ చేరారని పేర్కొంది ఆర్ఎస్ఎస్ బృందం.