విశాఖపట్నం : ఆనందపురం మండలం వెల్లంకి సాధుమఠం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనమొకటి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలో ఒకరు విశాఖ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు కాగా మరొకరు మారికవలసకు చెందిన ప్రైవేట్ డ్రైవర్ అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు.