కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉద్యమంలో భాగంగా అవసరమైతే తమ పంట ఉత్పత్తులను పార్లమెంటు వద్దకు తెచ్చి అమ్ముతామని అన్నారు. ఉద్యమంలో ఇప్పుడు యువతదే ముఖ్యమైన బాధ్యత. ‘జై శ్రీరాం’, ‘జైభీం’ నినాదాల్ని కలిపి లేవనెత్తితేనే దేశాన్ని రక్షించగలం అంటూ టికాయిత్ పిలుపునిచ్చారు. జైపుర్లో నిర్వహించి మహాపంచాయత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.