న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో తాను అడుగుపెట్టడం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని అన్నారు భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్. ఇది తనకు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్షణమని ఆయన అన్నారు. తన విజయాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యర్థి మీరాకుమార్కు కూడా ఆయన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. దేశప్రజలు తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా వ్యవహరిస్తానని కోవింద్ చెప్పారు.