వాషింగ్టన్: రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఎన్నో వినాశకర ఆదేశాలు ఇచ్చిన ఒక వ్యక్తిగత టెలిఫోన్ తాజాగా వేలంలో రూ.1.63 కోట్లు ధర పలికింది. దీనిపై హిట్లర్ పేరు, నాజీ స్వస్తిక ముద్ర ఉన్నాయి. 1945లో బెర్లిన్లో హిట్లర్ తన చివరి రోజుల్లో తలదాచుకున్న ఒక బంకర్లో ఈ ఫోన్ లభించింది. యుద్ధంలో జర్మనీ లొంగిపోయిన తర్వాత సోవియట్ సైనికుల ద్వారా నాటి బ్రిటన్ సైన్యాధికారి సర్ రాల్ఫ్ రేనర్కు ఇది చేరింది. 1977లో ఆయన చనిపోయినప్పటి నుంచి కుమారుడు రానుల్ఫ్ వద్ద ఉంది. దీనిని ఆదివారం అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం చెసాపీక్ నగరంలో ‘అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్’ సంస్థ వేలం వేసింది. హిట్లర్ ఫోన్ కనీసం రూ.1.34 కోట్ల విలువ ఉంటుందని నిర్వాహకులు అంచనా వేయగా, రూ.1.63 కోట్లు పలికింది. కొనుగోలుదారు వివరాలు వెల్లడి కాలేదు. హిట్లర్కు చెందిన ఒక ఆల్సేషియన్ శునకం బొమ్మ రూ.16.3 లక్షలకు అమ్ముడుపోయింది.