న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎంపీల ఓట్ల లెక్క తేలింది. రామ్నాథ్ కోవింద్కు మొత్తం 522 ఓట్లు వచ్చాయి. అంటే వీటి విలువ 3,69,576. అటు మీరాకుమార్కు 225 ఓట్లు వచ్చాయి వీటి విలువ 1,59,300. ఇక 21 ఓట్లు చెల్లకుండా పోవడం గమనార్హం. అంటే ఈ 21 మంది ఎంపీలు సరిగా ఓటు కూడా వేయలేదు. ఇక 12 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. అంటే అటు ఎంపీలు, ఇటు 12 రాష్ట్రాల్లో కలిపి రామ్నాథ్ కోవింద్కు మొత్తం 1389 ఓట్లు (విలువ 4,79,585), మీరాకుమార్కు 576 ఓట్లు (విలువ 2,04,594) వచ్చాయి. మొత్తంగా 37 ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే ఏ లెక్కన చూసుకున్నా.. భారీ మెజార్టీతో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కావడం ఇక లాంఛనమే.
ఇప్పటి వరకు పూర్తయిన ఓట్ల లెక్కింపు ప్రకారం రామ్ నాథ్, మీరా కుమార్ కు వచ్చిన ఓట్ల వివరాలు...
అరుణాచల్ ప్రదేశ్: రామ్ నాథ్ - 448, మీరా కుమార్ - 24
ఆంధ్ర ప్రదేశ్: రామ్ నాథ్ - 27189 , మీరా కుమార్ - 0
బీహార్: రామ్ నాథ్ కోవింద్ - 22,940, మీరా కుమార్ - 18,867
గోవా: రామ్ నాథ్ - 500, మీరా కుమార్ - 220
హిమాచల్ ప్రదేశ్: రామ్ నాథ్ -1530 మీరా కుమార్ 1087
జమ్ముకశ్మీర్: రామ్ నాథ్ -4032, మీరా కుమార్ 20160