న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం ఎనిమిది రౌండ్లలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ లో భాగంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కు చెందిన ఓట్లను ఇప్పటి వరకు లెక్కించారు. ఈ లెక్కింపులో ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ లీడ్ లో ఉన్నారు. ఆయన 60 వేల 683 ఓట్లతో ఉన్నారు. ఇక.. యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ 22 వేల 941 ఓట్లతో ఉన్నారు.