న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసన చేపడుతున్న తమిళనాడు రైతులు ఇవాళ వినూత్న ప్రదర్శన చేపట్టారు. పంటల రుణాలను మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం తమిళనాడు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేల జీతాలను నూర శాతం పెంచడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ఎమ్మెల్యేల జీతం పెరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాళ్ల చెప్పులతో రైతులు తమ తలలను తామే కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. దేశంలో బిక్షగాడి పరిస్థితి కన్నా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రైతు సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ఎమ్మెల్యేల జీతం పెరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాళ్ల చెప్పులతో రైతులు తమ తలలను తామే కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. దేశంలో బిక్షగాడి పరిస్థితి కన్నా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రైతు సంఘం నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.