చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ 11 టెలివిజన్ ను విడుదల చేసింది. దీనిలో పీ725 హైఎండ్ టీవీ మోడల్ లో వీడియో కాలింగ్ కెమెరా ఉంది. 43/50//55/65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.41,990–89,990 మధ్య ఉంది. పీ725 టీవీని మొదటిసారిగా ఇండియాలోనే విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెజాన్ లో విక్రయించనున్నట్లు టీసీఎల్ ఇండియా జీఎం మైక్ చెన్ తెలిపారు.
టీవీల ధరలు
43 అంగుళాలు టీవీ రూ.41,990
50 అంగుళాల టీవీ ధర రూ.56,990
55 అంగుళాల టీవీ రూ.62,990
65 అంగుళాల టీవీ రూ.89,990