తిరుమల: తిరుమల శ్రీవారిని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సచిన్ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సచిన్ వెంట హైదరాబాద్ క్రికెట్ సంఘం నాయకుడు చాముండేశ్వరినాథ్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు ఉన్నారు.