విశాఖ: బంగాళాఖాతంలోని వాయుగుండం బుధవారం తెల్లవారుజామున ఒడిసా వద్ద తీరం దాటింది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా మారి సాయంత్రానికి ఒడిసా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో అనేక చోట్ల.. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. గురు, శుక్రవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు