తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు వివాహ విందు దేశరాజధానిలో బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. స్థానిక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హజరై రామ్మోహన్నాయుడు, శ్రావ్యలను ఆశీర్వదించారు. కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కేంద్రమంత్రులు అరుణ్జైట్లీప్రకాశ్జావడేకర్, సురేశ్ప్రభు, తోమర్, పీయూష్గోయెల్, అశోక్గజపతిరాజు, సుజనాచౌదరిలతోపాటు తెదేపా, తెరాస, వైకాపా, భాజపా, పలు పార్టీలకు చెందినవందలాది మంది ఎంపీలు విందుకు హాజరయ్యారు.