ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైన్ ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 17, 2021, 01:09 PM

తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో తాండవ వంతెనపై రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. చల్లరావు తన భార్య, చెల్లెలని వెంటబెట్టుకుని విశాఖ నుంచి జన్మభూమి రైలు దిగి సమీపంలో ఉన్న ఇంటికి వంతెనపై నుండి నడక సాగించారు. వంతెన మధ్యలో ఉండగా అటుగా వస్తున్న సూపర్ ఫాస్ట్ రైలు దూసుకురావడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. చల్లారావు తప్పించుకున్నాడు. తనవల్లే కుటుంబ సభ్యులను కోల్పోయానని బోరున విలపించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com