ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు: బుద్దా వెంకన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 17, 2021, 12:59 PM

 పాదయాత్ర పేరుతో ఏ2 విజయసాయి రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా ఏ2 రెడ్డి పాదయాత్ర చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. విజయసాయి రెడ్డి పాదయాత్ర చేయాల్సింది విశాఖలో కాదని.. ఢిల్లీలో అని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. ఆంధ్రా భవన్ నుంచి పార్లమెంటు వరకూ పాదయాత్ర చేయాలన్నారు. దోచుకోవడానికే ఏ1, ఏ2 లు విశాఖపై కన్నేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. విజయసాయ రెడ్డి మాయమాటలను విశాఖ ప్రజలు నమ్మరన్నారు. కేసుల మాఫీ కోసం ఏపీకి తాకట్టు పెట్టారన్నారు. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలన్నారు. చేతకాకపోతే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com