ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 వేల కోట్ల రైతు రుణమాఫీ ప్రకటించిన తమిళనాడు సీఎం

national |  Suryaa Desk  | Published : Fri, Feb 05, 2021, 02:56 PM

చెన్నై: తమిళనాడు రైతులకు అన్నాడీఎంకే గవర్నమెంట్ శుభవార్త వినిపించింది. వ్యవసాయ రుణాలు తీసుకున్న 16 లక్షల మంది రైతులకు తమిళనాడు ప్రభుత్వం సుమారు 12 వేల కోట్లు మాఫీ చేయనున్నది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు 12,110 కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఆయన ఈవిషయాన్ని చెప్పారు. రైతులు మళ్లీ వ్యవసారం చేయాలంటే ఈ చర్య చాలా కీలకమైందని సీఎం అన్నారు. కరోనా వేళ రైతులకు పంట నష్టం జరిగిందన్నారు. వరుసగా రెండు తుఫాన్లు, అకాల వర్షాలు భారీ పంట నష్టం జరిగిందన్నారు. తక్షణమే రుణమాఫీ స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com