తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి ఆమని, నటుడు సప్తగిరి, జబర్దస్త్ పేం హైపర్ ఆది, రైజింగ్ రాజులు స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని నటి ఆమని తెలిపారు.