క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఇవాళ ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు.టీటీడీ ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వదించి, స్వామి వారి తీర్ద ప్రసాదాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఓజా పేర్కొన్నారు.