న్యూఢిల్లీ : రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంట్ లో ప్రారంభమైంది. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో మోదీ తొలి ఓటు వేశారు. అధికార పక్షన రామ్నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సెల్ఫోన్లు, పెన్నులను అధికారులు పోలింగ్ బుత్లోకి అనుమతించడం లేదు.