జమ్మూకశ్మీర్: అమర్నాథ్ యాత్రికుల బస్సు లోయలో పడిన ఘటనలో మృతి చెందినవారికి ప్రధాని మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 16 మంది యాత్రికులు మృతి చెందగా..29మందికి గాయాలైన విషయం తెలిసిందే.