న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో విషాదం అలుముకుంది. గిటోర్ని ప్రాంతంలో డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డ్రైనేజీలోనే నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి