గత నాలుగు నెలలుగా భారత క్రికెట్ జట్టుకి దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 26న ప్రారంభంకానుంది.
ఈ సందర్భంగా టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ని ఓ క్రీడా ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు రాహుల్. జట్టులో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిపిన రాహుల్ సీక్రెట్ క్రష్ గురించి వెల్లడించాడు.
* భారత జట్టులో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
విరాట్ కోహ్లీ, మురళీ విజయ్
* ఫేవరెట్ క్రికెటర్లు?
ఏబీ డివిలియర్స్ ఎప్పటికీ నా ఫేవరేట్ క్రికెటర్. విరాట్ కోహ్లీ కూడా.
* సీక్రెట్ క్రష్?
దిశా పటానీ
* జట్టులో చిలిపి పనులు చేసే వారు ఎవరు?
ఇషాంత్ శర్మ
* సహచర ఆటగాళ్లు మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు?
మాయ్(ఎమ్ఓఐ)