మధ్యప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మృతులు రాష్ట్రంలోని మురౌనా జిల్లాలోని చెహ్రా మాన్పుర్, పెహ్వాలీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కల్తీ మద్యం తాగడం వల్లే వారంతా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న 12 మందిని గ్వాలియర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.