ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 22, 2020, 05:23 PM

ఏపీ సీఎం జగన్ మంగళవారం రోజున వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చిస్తూ.. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, రాష్ట్రంలో పరిస్థితులను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలని సూచించారు. వ్యాక్సిన్ పనితీరుపై, బ్రిటన్ వంటి దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మండలంలో కనీసం పీహెచ్ సీలు ఉండేలా చూడాలని, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com