SC వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28 పార్లమెంట్ ని ముట్టడిస్తున్నామని జాతీయ మాదిగ పోరాట సంఘర్షణ సమితి అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ మాదిగ తెలిపారు. మాదిగల సమీకరణ శంఖారావంలో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ మాదిగ పోరాట సంఘర్షణ సమితి సభ్యులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమనికి నేతృత్వం వహించిన సమితి అధ్యక్షుడు కిషోర్ మాదిగ మాట్లాడుతూ గత కొంత కాలంగా sc కులాలను వర్గీకరణ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఓబీసీ లకు రిజర్వేషన్లు బిల్లులు, రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ బిల్లును మాత్రం ఏందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు వెంటనే ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. మాదిగలకి జరుగుతున్న అన్యాయాన్ని కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సి ల పట్ల బీజేపీ సర్కార్ వివక్ష ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. ఈ దర్నాలో రాష్ట్ర అధికార ప్రతినిధి దేవరపల్లి. విజయ్ వర్మ,రాయలసీమ జిల్లాల ఇంచార్జి థరూర్,నరేష్,కరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.