దుబాయ్: వెస్టిండీస్ చేతిలో ఓటమితో భారత టీ20 ర్యాంకు పడిపోయింది. మ్యాచ్కు ముందు నాలుగో స్థానంలో ఉన్న కోహ్లీసేన ఆ తర్వాత 115 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. గెలుపొందిన విండీస్ జట్టు ఐదో స్థానం నుంచి 117 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. బ్యాట్స్మెన్ ర్యాంకుల్లో మాత్రం కోహ్లీ తన హవా చూపిస్తున్నాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్ ఫించ్ (ఆసీస్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలర్లలో ఇమాద్ వసీమ్ (పాక్), జస్ప్రీత్ బుమ్రా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐసీసీ తాజా ర్యాంకులు
1. న్యూజిలాండ్ -125 పాయింట్లు
2. ఇంగ్లాండ్ - 123
3. పాకిస్థాన్ - 121
4. వెస్టిండీస్ -117
5. భారత్ - 115
6. ఆస్ట్రేలియా -110
7. దక్షిణాఫ్రికా - 110
8. శ్రీలంక - 95
9. అఫ్గానిస్థాన్- 86
10. బంగ్లాదేశ్ - 78