ఏపీ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 7073 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,61,458 కి చేరింది. ఇందులో 67,683 కేసులు యాక్టివ్ గా ఉండగా 5,88,169 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 5606 కి చేరింది. గత 24 గంటల్లో 48 మంది మరణించారు.తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 456, చిత్తూరులో 713, తూర్పు గోదావరి జిల్లాలో 1031, గుంటూరులో 533, కడపలో 368, కృష్ణా జిల్లాలో 423, కర్నూలులో 205, నెల్లూరులో 459, ప్రకాశం జిల్లాలో 806, శ్రీకాకుళం జిల్లాలో 430, విశాఖపట్నం జిల్లాలో 340, విజయనగరంలో 378, పశ్చిమ గోదావరి జిల్లాలో 931 కేసులు నమోదయ్యాయి.