ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కనక మహా లక్ష్మీ అమ్మ వారిని దర్శించుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలగాలని ఆరోగ్యంగా & సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా ప్రార్ధించడం జరిగింది. ప్రజలు వారి దినచర్యలో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్స్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, 35వ వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి అలుపనకనకరెడ్డి, వార్డు ప్రధాన కార్యదర్శి ఆదివిష్ణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.