బిజెపి రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా వామపక్షాలు చేస్తున్న బంద్ కి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఈరోజు విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంకు వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జి ఎ నారాయణరావు పాల్గొనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గరగా నిరసనలో పాల్గొని బందుకి మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ చేస్తున్నటువంటి అనైతిక బిల్లును రైతు వ్యతిరేక విధానాలను కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్న విధానాన్ని ఎండ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వద్దిపర్తి శ్రీనివాసరావు, సోడా దాసు, సుధాకర్, పి.శంకరరావు, కస్తూరి వెంకట్రావు, శ్రీనివాసన్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.