దేశంలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు ఇలా అందర్నీ పట్టుకుని పీడిస్తోంది. తాజాగా కేరళ రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి వీ.ఎస్. సునీల్కుమార్ కరోనా వైరస్ భారిన పడ్డారు. మంగళవారం చేయించుకున్న పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. దీంతో వ్యక్తిగత సహాయక సిబ్బందిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా మంత్రి కోరారు.సీఎం పినరయి విజయన్ మంత్రివర్గంలో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఆర్థికశాఖ మంత్రి టి.ఎం. థామస్ ఇసాక్, పరిశ్రమలశాఖ మంత్రి ఇ.పి.జయరాజన్ తాజాగా సునీల్ కుమార్ కోవిడ్-19 బారిన పడ్డారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళణ చెందొద్దన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని మంత్రి సునీల్ కుమార్ కోరారు.