ఏపీ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును నిన్న బాబు నేడు జగన్ దోచేస్తూన్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం కర్నూలు నగర కార్యదర్శి ఎండి షరీఫ్ విమర్శించారు.జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఇసుకను బందు చేసి ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తాను ఇసుక అందుబాటులో ఉంచి ఉచితంగా ఇస్తామని చెప్పి మోసగించి ఇప్పటివరకు ఇసుక అందుబాటులో కి తెలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఇసుక లేక వందలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి భార్య పిల్లలను పోషించడం కరెంటు బిల్లులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఇప్పటివరకు కూడా జగన్ చెల్లించలేదని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ బేరర్లు ఖాజా పాషా చాంద్ భాషా , ఉబేదు రెహమాన రఫిక్ మహబూబ్ బాషా ,షేక్షావలి, ఖాజం, మక్బూల్ తో పాటు దాదాపు 100 మందికి పైగా తదితరులు పాల్గొన్నారు.