ఆరు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సోమవారం నుండి ప్రారంభమైన పాఠశాలకు తమ పిల్లల ను కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు పంపాలని కర్నూలు నగర శివారులోని మిలిటరీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ విజయమ్మ సూచించారు. ఈ మేరకు ఆమె పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ప్రసంగించారు .విద్యార్థులను తల్లిదండ్రులు తమ పూర్తి అంగీకారం అయితేనే పాఠశాలకు పంపాలని కోరారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ దగ్గు ,జ్వరం , జలుబు వంటి లక్షణాలు ఉంటే వారిని ఇతర పిల్లలతో కలవకుండా ఇంటి దగ్గరే ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలలో ఆరడుగుల దూరాన్ని, వ్యక్తిగత పరిశుభ్రత కోసం హాండ్ శ్యానిటైజర్, సబ్బు, ఇంటి భోజనం తో పాటు, వాటర్ బాటిల్స్ వ్యక్తిగతoగా తెచ్చుకోవడం మంచిదన్నారు.విద్యా శాఖ ఆదేశాల మేరకు 50 శాతం మంది ఉపాద్యాయులు ప్రతి రోజు హాజరు కావాలని కోరారు. పాఠశాలలో జరిగిన నాడు-నేడు కార్యక్రమ వివరాలను కమిటీ చైర్మన్ వై.నాగరాజు వివరించారు. ఈ కార్యాక్రమంలో ఉపాద్యాయులు సరస్వతి,శ్రీదేవి,అనిత,తిమ్మప్ప,కృష్ణ మూర్తి, రాఘవయ్య, చంద్ర శేఖర్, పి.ఈ. టి.బాషా ,కమిటీ సభ్యులు పాల్గొన్నారు