ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ఎంఆర్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 07:16 PM

ఎస్వీ యూనివర్సిటీ హాస్టల్ ఎన్ఎంఆర్ ఉద్యోగుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి లెక్కల రాజశేఖర్ రెడ్డిని ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంఘం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 310 మంది ఉద్యోగుల తరపున నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హాస్టల్ ఎన్ఎంఆర్ ఉద్యోగులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని,నన్ను బలపరిచిన హాస్టల్ ఎన్ఎంఆర్ ఉద్యోగ సంఘ నాయకులైన గౌతమి,లోకేష్, సురేష్,రాజారెడ్డి,పద్మావతి లకు ధన్యవాదాలు తెలిపారు.హాస్టల్ ఎన్ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పై పోరాడటానికి ముందుంటానని హామీ ఇచ్చారు .అనంతరం వారందరితో కలిసి ఎస్వీయూ రిజిస్ట్రార్ ని కలిశారు . రిజిస్ట్రార్ కి వినతిపత్రం ఇస్తూ దాదాపు మూడు నెలల వేతనాలు, అరియర్స్ వెంటనే ఇవ్వాలని విన్నవించారు.వెంటనే ఎస్వీయూ రిజిస్ట్రార్ స్పందించి అతి త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని వారికి రావలసిన అరియర్స్ ఇసి మీటింగ్ లో పెట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని లెక్కల రాజశేఖరరెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com