ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 05:29 PM

ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలైన ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పెంచిన పన్నులు తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఉదయం బళ్లారి చౌరస్తాలో ఆటో కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్షులు పుల్లా రెడ్డి మాట్లాడుతూ... గత 5 నెలల నుండి కరోనాతో బాడిగ లేక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలకు నెలవారి కంతులు కట్టలేక కుటుంబ పోషణ భారమై అప్పులపాలై పస్తులు ఉంటున్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై రెండు దఫాలుగా పన్నులు పెంచడం గ్యాస్ పై 10% వ్యాట్ పెంచడం వల్ల రవాణా కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం పగబట్టినట్లుగా ఉందన్నారు.వాహన మిత్ర కింద 30 శాతం ఆటో కార్మికులకు సహాయం చేసి 100% ఆటో కార్మికులపై పన్నుల భారం మోపడం చేతిలో చాక్లెట్ పెట్టి చెవులకు ఉండే బంగారం లాగేసుకున్న చందంగా ఉందన్నారు. ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ సుధాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూ. 10000 ఆటో కార్మికులకు సహాయం చేసిన పేరుతో డీజిల్, పెట్రోల్, గ్యాస్ పై పన్నులు పెంచి రెండింతలు కార్మికుల నుండి వసూలు చేస్తుందని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పెంచిన పనులు తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు మురళి, మాలిక్ భాష, శిఖామణి, వలి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa