ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ ఉచిత అంబులెన్స్ సేవలు హర్షణీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 19, 2020, 05:18 PM

కర్నూలు నగరంలో కరోనా బారినపడి ఇప్పటివరకు 53,435 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు. వీరిలో ఇప్పటివరకు 49,280 మంది రోగులు కోలుకున్నారు. చికిత్స ఫలించక 437 మంది కర్నూల్ లో మృతిచెందారు. కోవిడ్ బారిన పడి చాలా మంది ఆసుపత్రులకు వెళ్ళలేక, మృతి చెందాక మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్ళలేక అల్లాడిపోతున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ లకు వేలకు వేలు డిమాండ్ చేస్తుండడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ దృష్టికి వెళ్ళింది. కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులకు ఎమ్మెల్యే చలించిపోయారు. స్పందిస్తూ గురువారం నాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కోవిడ్ ఉచిత అంబులెన్స్ ను సొంత నిధులతో ఏర్పాటు చేయడం హర్షణీయమని వైయస్సార్ సిపి 15వ వార్డు సమన్వయకర్త కేదార్ నాథ్ మాదారపు అన్నారు. కోవిడ్ ఉచిత అంబులెన్స్ సర్వీస్ ని సద్వినియోగం చేసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబెర్ 9440879791ను సంప్రదించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa