కర్నూలులోని స్థానిక సుందరయ్య భవనంలో ఐద్వా నగర కార్యదర్శి అరుణ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి ఆన్ లైన్ లో జాతీయ నాయకులు పుణ్యవతి మాట్లాడుతూ... స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న సభ్యులకు ఉపాధి కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గతంలో మహిళలు సామాజికంగా వెనుకబడ్డారు... కాబట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి డ్వాక్రాని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు లోన్ సౌకర్యం ఇచ్చి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో డ్వాక్రాని ఏర్పాటు చేశారు.అయితే ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కూడా స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి లక్షలాది మంది మహిళలు ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఆర్థికంగా సహకరించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే సామాజిక రుగ్మతలు తొలగిపోయే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే ప్రభుత్వాలు ఉపాధి కల్పన గురించి మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే పొదుపు సంఘాలలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కుటుంబాలు నడవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వారికి ఉపాధి కల్పిస్తే వారి కుటుంబాల్లోని ఆర్థిక పరిపుష్టి వచ్చి కుటుంబాలు సజావుగా నడిచే పరిస్థితి వస్తుందని సూచించారు. ఈ సదస్సులో ఐద్వా జిల్లా నాయకులు బి. పద్మ, ఓల్డ్ సిటీ కార్యదర్శి కె.ఎస్.పద్మ, టిఎల్ఎఫ్ కోశాధికారి మహిళా సంఘం నగర నాయకులు ఎం. ఉమా, కమ్రున్ భీ, అమీనా, కైరున్, వి.లత, కృష్ణవేణి, పొదుపు సంఘాల సభ్యులు పర్వీన్, శివలీల, లక్ష్మి, ఆర్పిలు, ఓబిలు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa