కరోనాతో మరో ఎంపీ మృతి చెందారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచాడు. ఆయన జూలై 22నే రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే ఆయన మరణించాడు. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa